సోషల్ మీడియాలో శ్రీరెడ్డి నోట్లో నోరు పెట్టడం అనేది దానికి మించిన తప్పు మరొకటి ఉండదు అని ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు చెప్పే మాట. క్యాస్టింగ్ కోచ్ తో పాపులర్ అయిన ఈమె ఎం సినిమాలు చేసిందో గాని సోషల్ మీడియాలో మాత్రం తనకు నచ్చని వాళ్ళను తిట్టే విధానం మాత్రం వివాదాస్పదంగా ఉంటుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ తన ఆవేశాన్ని చూపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. దీనితో ఆమెను కనపడకుండా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను ఆమె తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉంటుంది. 

 

ఇక తాజాగా తన నోటి దురుసుతో శ్రీరెడ్డి ఇబ్బంది పడింది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో అసభ్య పదజాలంతో తనను శ్రీరెడ్డి తిట్టారు అంటూ డాన్స్ మాస్టర్ రామారావు అలియాస్ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆమెతో ఫోన్‌లో మాట్లాడా అని, ఆమె పోరాటానికి అండగా ఉంటామని చెప్పామని, అప్పుడు నన్ను ‘రాకేశ్‌గారు’ అని పిలుస్తుంటే, ‘నేను నీకు తండ్రిలాంటివాడిని బాబాయ్‌ అని పిలువమ్మా అని సూచించా అని ఆయన గుర్తు చేసుకున్నారు. 

 

తనకు జరిగిన అన్యాయం గురించి ‘మా’లో చెబుదామని అన్నానమో, అయితే, ఆమె పవన్‌కల్యాణ్‌గారిపైనా, ఇతరుల పైనా ఫేస్‌బుక్‌లో దారుణంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారని, అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాను అని చెప్పారు రామారావు. ఇటీవల తాను ఓ ఇంటర్వ్యూలో కూడా శ్రీరెడ్డితో నాకున్న పరిచయం గురించి ఇదే విషయాన్ని చెప్పా అన్నారు. అయితే, ఆమె దాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా, ఫేస్‌బుక్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా అన్నారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: