తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఎంతో మంది నటీమణులు కావాలని వస్తున్నవారు దళారుల చేతుల్లో మోసపోతున్నారని.. వారికి పడక సుఖం ఇస్తే కానీ ఛాన్సులు రావడని ఆరోపణలు చేసింది. తెలుగు లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు ఆడవారిపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. అంతే కాదు కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అయితే పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరికీ నెగిటీవ్ గా మారిపోయింది. దాంతో ఈ అమ్మడు చెన్నై వెళ్లిపోయింది. అక్కడ నుంచి పలువురు సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తుంది.
తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రెటీలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఫైర్ అవుతున్నారు. శ్రీరెడ్డిపై ప్రముఖ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యదు చెయ్యగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మద్య డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పై ఛండాలంగా మాట్లాడింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొంతకాలం కిందట టాలీవుడ్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. ఇటీవల కొంతకాలంగా మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రారంభించింది. కొన్ని రోజులుగా తనను దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు వంటా వార్పు అంటూ సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు మళ్లీ రెచ్చిపోవడంపై అందరై మండి పడుతున్నారు.