టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అని ఒక్క నాని కి మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టే నానీ నేచురల్ యాక్టర్. ఈ నేచురల్ యాక్టర్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఉగాది కానుకగా 'వి' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అయితే అంతకుముందే మరో సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అది హీరోగా కాదు. నిర్మాతగా అనమాట. 'అ' సినిమాతో వాల్ పోస్టర్ అనే బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారిన నాని 'అ' సినిమాతో మంచి సక్సస్ ని అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'అ' సినిమా ఉత్తమ మేకప్ప్ విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. అందుకే ఈ సినిమాకి సీకెల్ కూడా తెరకెక్కించడానికి కథ సిద్దం చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఈ సారి నాని నిర్మించడం లేదు. అందుకు కారణాలు ఏంటో తెలియలేదు.

 

'అ' సినిమా తర్వాత నాని బ్యానర్ లో తెరకెక్కిన సినిమా 'హిట్'. ఫలక్ నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వాల్ పోస్టర్ బ్యానర్ లో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తుండగా నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించారని తెలుస్తోంది. ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని డీల్ చేసే పోలీస్ ఆఫీసరుగా విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటించాడు.

 

అమ్మాయి ఎలా మిస్సయింది..ఆమెకి ఏం జరిగింది ... అనే అంశాలని ఎంతో థ్రిల్లింగ్ గా చూపెడుతున్నారట. ఇక ట్రైలర్ చూస్తుంటే 'హిట్' సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే నిర్మాతగా నాని ఖాతాలో రెండో హిట్ పడినట్టేనని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒకవైపు హీరోగా మరో వైపు నిర్మాతగా నాని రెండు పడవల మీద ప్రయాణం బాగానే సాగిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: