సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసంక్రాంతికి  విడుదలైన ఈ చిత్రం 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం 50రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకోనుంది. ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు , అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా మార్చి 2 నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ  చిత్రంలో మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మునుపటి సినిమాల్లో కన్నా మరింత అందంగా కనిపించి అదరగొట్టాడు. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ,అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. 
 
ఇక ప్రస్తుతం మహేష్, యూఎస్ లో వొకేషన్ లో వున్నాడు. ఇదిలావుంటే తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు వంశీ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. థమన్ సంగీతం  అందించనున్నాడు.
 
ఇక  వంశీ - మహేష్  కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన మహర్షి 100కోట్ల వసూళ్లను రాబట్టి  సూపర్ అయ్యింది. మరి ఈ రెండో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏప్రిల్ నుండి మహేష్ 27 సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: