టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఫిదా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. నిజానికి అంతకముందు ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఢీ అనే డ్యాన్సింగ్ షో లో ఒక పార్టిసిపెంట్ గా వ్యవహరించి తన టాలెంట్ ని నిరూపించుకున్న సాయి పల్లవి, ఆ తరువాత మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత ఆమె నటన నచ్చిన శేఖర్ కమ్ముల, ఆమెను ఫిదా సినిమాలో తీసుకోవడం, ఇక రిలీజ్ తరువాత ఆ సినిమా ఊహించిన రేంజ్ ని మించి అనూహ్య విజయాన్ని అందుకోవడం జరిగింది. నిజానికి ఫిదా సినిమా సక్సెస్ లో చాలావరకు సాయి పల్లవి పాత్ర కూడా ఉందని అంటుంటారు సినీ విశ్లేషకులు. 

 

ఇకపోతే ఆ తరువాత మెల్లగా అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుని ముందుకు సాగుతున్న సాయి పల్లవి, ప్రస్తుతం రానాతో విరాట పర్వంతో పాటు, అటు నాగచైతన్య తో లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా సాయి పల్లవి పెళ్లి విషయమై ఒక వార్త కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, హీరోయిన్ అమల పాల్ మాజీ భర్త అయిన ఏఎల్ విజయ్ తో చాలా రోజులుగా ఆమె డేటింగ్ లో ఉందని అప్పట్లో వార్తలు రావడం, అలానే ఆపై వారు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఉందంటూ కూడా మరింతగా పుకారవడం జరిగింది. కాగా ఆ తరువాత ఆ వార్తలపై సాయి పల్లవి మాత్రం స్పందించలేదు. 

 

ఇక మళ్ళి కొద్దిరోజలుగా ఆ వార్తలు మరింత విస్తృతంగా ప్రచారం అవ్వడంతో పాటు, ఏకంగా సాయి పల్లవితో ఏఎల్ విజయ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయమై సాయి పల్లవి తన సన్నిహితులతో మాట్లాడుతూ, ఛీ, ఛీ అసలు కొందరు మీడియా వారికి ఇంగితం ఉందొ లేదో కూడా అర్ధం కావడం లేదు. అసలు ఏఎల్ విజయ్ తో నాకు డేటింగ్ ఏంటి, పెళ్లి ఫిక్స్ అవ్వడం ఏంటి. ఆ విధంగా తప్పుడు వార్తలు రాస్తూ మా ఇద్దరికీ లింకప్ పెట్టడం నిజంగా దారుణం అని, దయచేసి ఇకపై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియా వారికి తన తరపున విజ్ఞప్తి చేయమని ఆమె కోరినట్లు సమాచారం. మరి దీనితో అయినా సాయి పల్లవి పెళ్లి విషయమై కోలీవుడ్ లో వస్తున్న పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: