విక్రం కె కుమార్ .. మనం సినిమాతో ఈ డైరెక్టర్ అక్కినేని ఫ్యామిలీకి జీవితంలో మరిచిపోలేని హిట్ ని బహుమతిగా ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి సినిమా కావడం విశేషం. ఎంతో క్రియోటివ్ గా సినిమాలను తెరకెకించే విక్రం కుమార్ ఈ కథ నాగార్జున ఫ్యామిలీకి చెప్పినప్పుడు ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదట. కానీ అందరం కలిసి జీవితంలో శాశ్వతంగా మిగిలిపోయో ఒక సినిమాలో నటించే అవకాశం దొరికిందని విక్రం కుమార్ కి ఒకే చెప్పారు. నాగార్జున, నాగ చైతన్య, నాగేశ్వర రావు, ఆఖరిలో అక్కినేని అఖిల్ కూడా కొన్ని నిముషాల పాటు కనిపించి అందరికి షాకిచ్చాడు.

 

మనం సినిమా సూపర్ హిట్ అయింది. అక్కినేని ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సస్ మీట్ లో నాగార్జున తండ్రి నాగేశ్వర రావు ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ మాకు ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు జీవితాంతం నీకు రుణ పడి ఉంటామని పొగడ్తలతో ముంచేశాడు. ఇక ఈ సినిమా టాపిక్ ఎప్పుడు వచ్చినా నాగార్జున విక్రం కుమార్ నే తలుచుకోవడం గొప్ప విషయం. 

 

దాంతో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ అలాంటి కథ వస్తే చేయాలని బాగా ఆతృతగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీలు అలాంటి కథ కోసం చూస్తున్నామని కూడా తెలిపిన సందర్భాలున్నాయి. రీసెంట్ గా మోహన్ బాబు కూడా మనం సినిమా నాకు చాలా ఇష్టమని అలాంటి కథ గనక ఎవరైనా తీసుకు వస్తే ఖచ్చితంగా నేను నా ముగ్గురు పిల్లలు కలిసి చేయడానికి సిద్దమని తెలిపారు. అయితే ఇప్పుడు మరో న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

 

అదే మనం లాంటి స్క్రిప్ట్ ని విక్రం కుమార్ మెగా ఫ్యామిలీ కోసం రెడీ చేస్తున్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిహారిక ..నటించబోతున్నారని సమాచారం. వాస్తవంగా అల్లు అర్జున్ ఇంతకముందే విక్రం కుమార్ తో సినిమా చేయాలి. కాని ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరి అది పక్కన పెట్టి విక్రం మెగా ఫ్యామిలీ కోసం ఈ కథ సిద్దం చేశారని అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే మెగా ఫ్యామిలీకి ఇది ఒక గొప్ప సినిమాగా మిగిలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: