ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ ఉన్నట్టు ఉండి పడిపోయింది. ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కాలుకి దెబ్బ తగలగా ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతుండగా మరణించిన వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మృతుల్లో ఒకరు 29 ఏళ్ల మధు.. మరొకరు 34 ఏళ్ల కృష్ణగా పోలీసులు తెలిపారు. 

 

60 ఏళ్ల చంద్రన్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉన్నారు. మరో 10 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. శంకర్ ప్రాణాల నుంచి బయటపడినా ఆయన కాలుకి మాత్రం తీవ్ర గాయం అయినట్టు తెలుస్తుంది. శంకర్ ని సమీపంలోని సవిత ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కమల్ సంఘటనా స్థలానికి వచ్చాడు. గాయపడిన వాళ్ళను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతుల కుటుంబాల తో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటా అని కూడా హామీ ఇచ్చినట్టు సమాచారం. 

 

కమల్ రాజకీయాలతో పాటుగా సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. శంకర్ 2.o తర్వాత భారీ బడ్జెట్ తో కమల్ హాసన్ తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని 30 శాతం వరకు పూర్తి చేయగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై సిని పెద్దలు కూడా ఆరా తీసారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ని వచ్చే నెల నుంచి విదేశాల్లో ప్లాన్ చేసాడు దర్శకుడు. ఈ తరుణంలో జరిగిన ఈ ప్రమాదంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: