పింక్ చిత్రం రీమేక్‌తో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు క్రిష్ సినిమా కూడా తెర‌కెక్కిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు ప్లాన్ చేస్తూ.. మ‌రో ప‌క్క రాజ‌కీయ ప‌రంగా బిజీగా ఉంటున్నారు. సినిమాలు, రాజ‌కీయాలు రెండు చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే పింక్‌ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్… కాగా ఈ చిత్రానికి “వీరూపాక్షి” అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రోజుకొక వార్త బ‌య‌ట‌కు వ‌స్తూ సినీ ప్రేక్ష‌కుల్లో రోజు రోజుకి ఆశ‌క్తిని పెంచుతుంది.

 


తాజాగా మరొక వార్త బయటకొచ్చింది. కాగా వీరి కలయికలో రానున్నటువంటి పీరియాడికల్ చిత్రంలో అలనాటి కాలానికి సంబందించిన అన్ని అంశాలను మేళవించేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్  చిత్రం కోసం చాలా పెద్ద ప్లానే వేశాడంటండోయ్‌.. అదేంటా అనుకుంటున్నారా. ఇంకేముంది ఈయ‌న కూడా భారీ సెట్ల మీద ప‌డ్డాడు.  ఓ బిగ్ బోట్ సెటప్ వేయనున్నాడని సమాచారం. దీనిలో ప్రత్యేకంగా ఒక ఫైట్ సీన్ ని తీయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు.

 

మ‌రి ప‌వ‌న్‌కి ఈ రెండు చిత్రాలే కాక మ‌రో మూడు సినిమాల వ‌ర‌కూ ఆయ‌న చేతిలో ఉన్నాయి. ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఇంక ఎక్క‌డా విరామం లేకుండా ప‌వ‌న్ అల‌రిస్తూనే ఉంటాడు. వీట‌న్నిటిలో ఏది బాగా హిట్ అవుద్దో వేచి చూడాలి. అలాగే పింక్ రీమేక్ చిత్రం కాబ‌ట్టి ఆశించినంత ఫ‌లితం రాక‌పోవ‌చ్చేమో అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: