టాలీవుడ్ లో స్టార్ వారసుల హవా కొనసాగుతుంది. ఇన్నాళ్లు హీరోల కొడుకులే హీరోలుగా వచ్చే వారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోల కొడుకులే కాదు కూతుళ్లు కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. మెగా ఫ్యామిలీ నిహారిక ఇప్పటికే వరుస సినిమాలు చేస్తుండగా అదే దారిలో స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక.. మొదటి సినిమా దొరసానితో అందరిని మెప్పించింది. అయితే ఆ సినిమాలో ఆమె నటన చూసి ఆహా ఓహో అనేసి నా శివాత్మికకు సరైన ఆఫర్లు మాత్రం రావట్లేదు. 

 

ప్రస్తుతం చేతిలో అమ్మడికి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి రంగమార్తాండ కాగా మరోటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు నరేష్ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం కానిస్తున్నారట. అయితే శివాత్మికకు స్టార్ ఛాన్సులు వస్తాయని అనుకోగా ఆమె ఇలా యువ హీరోలతో చేయడం నిరాశ కలిగించే విషయమే.. కనీసం మీడియం బడ్జెట్ సినిమాల్లో అయినా చేస్తే బాగుంటుంది. దొరసానిలో దర్జాగా కనిపించి తన నటనతో ఆకట్టుకున్న శివాత్మిక తేజకి జోడిగా నటించడం విశేషం. 

 

హీరోయిన్ గా ఎదగాలి అంటే ఇలా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే కచ్చితంగా కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సినిమాల సెలక్షన్ కు ఇంట్లో స్టార్ ఫ్యామిలీ ఉన్నా వారి మాటలు వినకుండా తన కెరియర్ తనదే అన్నట్టుగా ప్రవర్తిస్తుందట శివాత్మిక. మరి ఆమె చేసే ఈ సినిమాలు అమ్మడికి స్టార్ ఇమేజ్ తెస్తాయో లేదో చూడాలి. అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు సరైన ఛాన్స్ వస్తే మాత్రం అదరగొట్టడం ఖాయం. కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమాలో కూడా శివాత్మికకు మంచి రోల్ ఇచ్చారట. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ నటిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ అలీ రెజా, రాహుల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: