చిరంజీవి కొరటాల మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈమధ్యనే  రాజమండ్రిలోని గోదావరిని ఆనుకుని చుట్టుపక్కల ఉన్న ఇసుక ర్యాంప్ ల వద్ద ఈ మూవీకి సంబంధించి ఒక భారీ యాక్షన్ సీన్ కొరటాల శివ చిరంజీవి పై చిత్రీకరించాడు. అదేవిధంగా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన త్రిష చిరంజీవి లపై కూడా కొన్ని సీన్స్ తీసారు. 


‘రంగస్థలం మూవీ గోదావరి ప్రాంతంలో తీయడంతో ఆ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ ను కొరటాల చిరంజీవిల మూవీ ‘ఆచార్య’ కు కూడ రిపీట్ చేయాలని చరణ్ సూచనతో ఈ సినిమా షూటింగ్ ను రాజమండ్రి చుట్టుపక్కల షూట్ చేసినట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో సుమారు 40 నిముషాల పాటు ఉండే రామ్ చరణ్ నక్సలైట్ పాత్ర కోసం చరణ్ ను తప్పించి ఇప్పుడు మరొక టాప్ హీరో అన్వేషణలో లో కొరటాల ఉన్నట్లు టాక్. 


తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి అయ్యేవరకు చరణ్ జూనియర్ లు మరొక సినిమా చేయకూడదు అని రాజమౌళి కండిషన్ పెట్టిన పరిస్థితులలో తనకు తాను గా ఆకండిషన్ ను తొలిగించి చరణ్ కు ఎలా సహకరిస్తాను అని రాజమౌళి సూచన ప్రాయంగా కొరటాల తో అనడంతో ఇప్పుడు కొరటాల చిరంజీవిల మూవీ నుండి చరణ్ తప్పుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుకు చిరంజీవి చరణ్ లు కూడ అంగీకరించినట్లు ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. 


మూవీ నుండి చరణ్ తప్పుకోవడంతో ఆపాత్రను మహేష్ చేత కాని లేదంటే అల్లు అర్జున్ చేత కాని నటింప చేసి ఈ మూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ తో పాటు భారీ బిజినెస్ చేసే విధంగా ప్రస్తుతం కొరటాల ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు చరణ్మూవీ నుండి తప్పుకున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ బన్నీల లో ఎవరో ఒకర్ని ఫైనల్ చేసి వారి పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కూడ వేగంగా పూర్తి చేసి దసరా కు విడుదల చేయాలని కొరటాల ప్లాన్ అని అంటున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ అమెరికాలో బన్నీ సుకుమార్ ప్రాజెక్ట్ కోసం యోగా క్లాసుల నిమిత్తం విదేశాలలో ఉన్న పరిస్థితులలో వీరిద్దరిలో ఎవరు ముందు కొరటాల రాయబారానికి స్పందిస్తారో వారికే ఈ ప్రత్యేక పాత్ర దక్కే అవకాశం ఉంది అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: