మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ను త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ స్పష్టంగా ఈ మధ్య జరిగిన సంక్రాంతి రేస్ లో డామినేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి మహేష్ ను త్రివిక్రమ్ అనుకోకుండా కార్నర్ చేస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


ఒకప్పుడు మహేష్ త్రివిక్రమ్ లు మంచి సన్నిహితులు వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ మూవీని ఇప్పటికీ బుల్లితెర పై ప్రసారం అయినప్పుడల్లా అనేకమంది చూస్తూనే ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ మూవీ ఫ్లాప్ కావడంతో వీరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది. వాస్తవానికి త్రివిక్రమ్ మహేష్ తో మరొక మూవీని తీయడానికి అనేకసార్లు ప్రయత్నించినా మహేష్ నుండి మాత్రం స్పందన రాలేదు అని అంటారు. 


దీనితో వీరిద్దరి మధ్య బయటపడని గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ జూనియర్మూవీ మహేష్ వంశీ పైడిపల్లి మూవీతో వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో ఒకే నెలలో విడుదలకాబోతు ఉండటంతో మరొకసారి మహేష్ త్రివిక్రమ్వార్ అనుకోకుండా జరగబోతోంది. అందరి ఊహాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ తో చేయబోయే సినిమా విషయాన్ని ప్రకటించడమే కాకుండా ఆ మూవీ రిలీజ్ 2021 ఏప్రిల్ లో ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. 


వాస్తవానికి మహేష్ వంశీ పైడిపల్లి మూవీ కూడ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుందని సంకేతాలు వస్తున్నాయి. మహేష్ కు సెంటిమెంట్ రీత్యా మే నెల కలిసిరాదు. అందువల్ల ఇష్టం ఉన్నా లేకున్నా మహేష్ వంశీ పైడిపల్లిల మూవీ త్రివిక్రమ్ జూనియర్మూవీ విడుదల కాబోయే ఏప్రిల్ లోనే విడుదల అయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి మహేష్ త్రివిక్రమ్వార్ తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: