సూపర్స్టార్ మహేష్బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా గుర్తుందా....మహేష్ కెరియర్లోనే డిజాస్టర్ మూవీ అని చెప్పాలి. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ కృతిసనన్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి అనుకుంటున్నారా... కృతి తల్లి కాబోతున్న ఫొటో. అవునండి కృతి కడుపుతో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇదంతా నిజమే అనుకుంటున్నారా. ఇక మీరు పప్పులో కాలేసినట్లే ప్రస్తుతం కృతి `మిమీ` అనే చిత్రంలో నటిస్తోంది. లక్ష్మణ్ ఉతెకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సరోగేట్ మదర్ పాత్రలో నటిస్తోంది.
ఈ నేపథ్యంలో కృతి సనన్ కడుపుతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే... ఈ ఫోటోను చిత్ర యూనిట్ వైరల్ చేయలేదు. కృతి అభిమాని ఒకరు ఈ ఫోటోను షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా ఈ పాత్ర కోసం కృతిసనన్ దాదాపు 15 కిలోల బరువు పెరిగింది. కృతి సనన్ విషయానికొస్తే.. తెలుగులో సుకుమర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘వన్ ‘నేనొక్కడినే’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత తెలుగులో ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఉండడంతో ఈ చిత్రం అప్పట్లో జనాలకి పెద్దగా ఎక్కలేదు.
ఈ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘దోచెయ్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. దాంతో బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది ఈ భామ. బాలీవుడ్లో మాత్రం వరుస ఆఫర్లతో ఈ భామ దూకుడు మాములుగా లేదనే చెప్పాలి. హిందీలో ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుకా చుప్పీ’, ‘హౌస్ ఫుల్ 4’ తదితర సూపర్ హిట్ సినిమాలతో మంచి పేరు సాధించింది. మరి ఒకేసారి తల్లి కాబోయే పాత్రలో నటిస్తుంది. మరి ఈ చిత్రం కృతికి ఎలాంటి పేరు తెస్తుందో వేచి చూడాలి.