కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ నిన్న తన 90వ పుట్టినరోజు అతి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖులు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలియచేసారు. 


తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వనాథ్ నుండి మరొక అద్భుతమైన కళాఖండం రావాలని ఆయన దర్శకత్వం వహించే ఓపిక లేకపోయినా కనీసం ఒక కథ వ్రాసి ఇస్తే ఆ కథను సినిమాగా తీయిస్తాను అని స్వయంగా గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినా విశ్వనాథ్ నవ్వి ఊరుకున్నారు కాని స్పందించలేదు. ఈ సందర్భంలో చిరంజీవి గతంలో ఒకసారి విశ్వనాథ్ వల్ల కన్నీరు పెట్టుకున్న సంఘటనను వివరిస్తూ ఒక మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.


విశ్వనాథ్ వరసపెట్టి సినిమాలు తీస్తున్న సమయంలో వచ్చిన ‘స్వాతి ముత్యం’ మూవీ ఆరోజులలో సూపర్ హిట్. క్లాస్ మాస్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా విపరీతంగా ఆదరించిన ఆ మూవీతో కమల్ హాసన్ కు విపరీతమైన పేరు రావడమే కాకుండా అనేక అవార్డులు కూడ వచ్చాయి. ఆ రోజులలో మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి ‘స్వాతిముత్యం’ మూవీని చూసిన తరువాత ఆ రాత్రి చిరంజీవికి నిద్ర పట్టలేదట. 


‘స్వాతిముత్యం’ లో కమల్ చేసిన అద్భుతమైన పాత్ర తనకు ఎందుకు రాలేదు అంటూ బాధ పడటమే కాకుండా మరునాడు చిరంజీవి విశ్వనాథ్ కు ఫోన్ చేసి తనతో ‘స్వాతిముత్యం’ లాంటి ఒక అద్భుతమైన సినిమాను తీయమని కోరాడట. అప్పుడు విశ్వనాథ్ శ్రద్ధ పెట్టి మెగా స్టార్ తో ‘స్వయంకృషి’ మూవీ తీయడం ఆ మూవీతో చిరంజీవికి సక్సస్ తో పాటు అనేక అవార్డులు రావడం కూడ జరిగిపోయింది. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో విశ్వనాథ్ చిరంజీవిలు కలిసి ‘ఆపద్భాందవుడు’ మూవీ కోసం పని చేసినా ఆ మూవీలో చిరంజీవి కష్టపడి శివ తాండవం చేసినా విశ్వనాథ్ చిరంజీవి ల ప్రయత్నం అప్పట్లో ఫలించలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: