పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా ఇడియట్. ఈ సినిమాలో కన్నడ భామ రక్షిత నటించింది. అప్పట్లో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత హీరోయిన్ గా రిటైర్ అయ్యింది. ఈమధ్య కన్నడ టివి షోల్లో కనిపిస్తున్న ఈ అమ్మడిని చూసి అందరు షాక్ అవుతున్నారు. అసలేమాత్రం గుర్తు పట్టలేని విధానం రక్షిత మారిపోయింది. 

 

అంతేకాదు పెళ్లి తర్వాత డైట్, గ్లామర్ లాంటి విషయాలు పట్టించుకోవడం మానేసింది కాబోలు అందుకే రక్షిత బాగా లావుగా తయారైంది. ఈ అమ్మడిని ఇలా చూస్తే రవితేజ ఇడియట్ లో చూసిన రక్షిత తనేనా అనేంతలా మారిపోయింది. పెళ్లి తర్వాత సహజంగానే ఒంటి తీరులో మార్పు వస్తుంది కాని అసలు గుర్తు పట్టలేనట్టు మారడం మాత్రం షాకింగ్ గానే ఉంది. ఇడియట్ తో వచ్చిన క్రేజ్ తో నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్స్ తో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడిలా మారిపోవడం చూసి అందరు అవాక్కవుతున్నారు. అప్పట్లో రక్షిత ఫ్యాన్స్ అంతా ఇప్పటి ఆమె రూపం చూసి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 

 

తెలుగుతో పాటుగా సౌత్ పలు భాషల్లో సినిమా చేసిన రక్షిత ప్రస్తుతం టివి షోల్లో చేస్తుంది. మంచి అవకాశం వస్తే ఆమె మళ్ళీ సినిమా ల్లో నటించాలని అనుకుంటుంది. ఏది ఏమైనా ఆమెతో చేసిన హీరోలు ఇప్పటికి అలానే ఉంటే.. రక్షిత మాత్రం కంప్లీట్ గా మారిపోయింది. ప్రేమ్ తో వివాహం అనంతరం రక్షిత కనీసం మీడియాలో కూడా ఎప్పుడు కనిపించలేదు.

 

ఆఫ్టర్ మ్యారేజ్ తన చిన్న ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రక్షిత మళ్ళీ సినిమాల్లోకి రావాలంటే మాత్రం కొద్దిగా లుక్ మీద దృష్టి పెట్టాల్సిందే. వాలెంటైన్స్ డే సందర్బంగా రక్షిత తన భర్త ప్రేమ్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: