‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయమై స్పష్టమైన క్లారిటీ నిన్న వచ్చేసింది. త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందించబోయే మూవీకి త్రివిక్రమ్ తన సొంత నిర్మాణ సంస్థగా భావించే హారికా హాసిని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 


వాస్తవానికి ‘అల’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్నిర్మాత పేరు చెపితే ఆ నిర్మాత బ్యానర్ లో టాప్ హీరోలు సినిమాలు చేయవలసిన పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా జూనియర్ తో త్రివిక్రమ్ తీయబోయే మూవీ విషయంలో కూడ త్రివిక్రమ్ కొన్ని రకాల రాజీలు పడవలసి వచ్చింది అని అంటున్నారు. 


జూనియర్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు తన అన్న కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా ఉండి తీరవలసిందే అన్న తారక్ కండిషన్ కు తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా త్రివిక్రమ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ నటించబోయే మూవీ కావడంతో ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. అయితే ఈ లాభాలు త్రివిక్రమ్ పడిన రాజీ వల్ల అతడిని నమ్ముకుని ఉన్న రాథా కృష్ణతో సమానంగా పెట్టుబడి పెట్టకుండా కళ్యాణ్ రామ్ కూడ లాభపడతాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించి త్రివిక్రమ్ జూనియర్ లు పారితోషికం తీసుకోకుండా ఈ మూవీ బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నారు. 


అదేవిధంగా కళ్యాణ్ రామ్ కు కూడ ఈ మూవీ బిజినెస్ లో షేర్ ఉంటుంది. దీనితో ఇంతమందికి లాభాలు పంచిన తరువాత ఈ మూవీ వల్ల హారికా హాసినీ రాథా కృష్ణకు వచ్చే లాభాలు ఎంత అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ మూవీ విషయంలో కూడ ఇలాగే త్రివిక్రమ్ బన్నీ ఒత్తిడితో అరవింద్ కు షేర్ ఇవ్వడంతో త్రివిక్రమ్ ను నమ్ముకున్న వారికి సగం లాభాలు మాత్రమే మిగులుతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో త్రివిక్రమ్ రాజీ మార్గాల పై కామెంట్స్ వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: