గతవారం విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారిపోయాడు. దీనితో ప్రస్తుతం ఇతడితో మూవీ చేస్తున్న పూరీ జగన్నాథ్ ఛార్మీలు తమ మూవీ మార్కెట్ విషయమై తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. 


‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీకి విజయ్ ఫెయిల్యూర్ మూవీ ‘నోటా’ కంటే ఓవర్సీస్ లో అతి తక్కువ కలక్షన్స్ రావడంతో ఓవర్సీస్ లో కూడ విజయ్ మార్కెట్ చాల ఘోరంగా దెబ్బ తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మైత్రీ మూవీస్ విజయ్ దేవరకొండతో మొదలు పెట్టి ఆ మూవీ కథ విజయ్ కి నచ్చక పోవడంతో ఆగిపోయిన ఆ మూవీ పై పెట్టిన 10 కోట్ల ఖర్చులో సగ భాగం ఇమ్మని విజయ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. 


దీనితో మైత్రీ మూవీస్ లాంటి బడా నిర్మాణ సంస్థతో అభిప్రాయభేదాలు పెట్టుకోవడం ఇష్టం లేని విజయ్ ఆ నిర్మాణ సంస్థకు కలిగిన నష్టానికి ప్రతిఫలంగా తాను మరొక సినిమాను చేసి ఇస్తానని మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మైత్రీ మూవీస్ విజయ్ తో మరొక సినిమాను తీయడానికి దర్శకుడు మారుతీ సుజిత్ లతో కథల విషయమై ఇప్పుడు చర్చలు జరుపుతున్నట్లు టాక్. 


అదేవిధంగా మరి కొన్ని నిర్మాణ సంస్థల అడ్వాన్స్ లు కూడ విజయ్ వద్ద ఉన్నాయని ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి బాగుండక పోవడంతో విజయ్ అడ్వాన్స్ లు ఇచ్చిన కొందరు నిర్మాతలు రకరకాల కారణాలు చెప్పి తెలివిగా విజయ్ నుండి తమ అడ్వాన్స్ లు తిరిగి రాబట్టుకోవాలని వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం విజయ్ తో సినిమా తీస్తున్న పూరీ జరుగుతున్న పరిణామాలు చూసి తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో నిన్న మొన్నటి వరకు విజయ్ డేట్స్ ఇస్తే చాలు అంటూ అతడి చుట్టూ తిరిగిన దర్శక నిర్మాతలు రివర్స్ గేర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: