తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీకళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన అందాల కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.. స్టార్ హీరో సరసన ఛాన్సులు కొట్టేస్తూ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది.   తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా ఇంకా గ్లామర్ చెక్కు చెదరలేదు.  ఇప్పటికీ సీనియర్, జూనియర్ హీరోలతో నటిస్తూనే ఉంది.  గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ తో కవచం, సీతా చిత్రాల్లో నటించింది.  కొంత కాలంగా తెలుగు లో పెద్దగా ఛాన్సులు రావడం లేదు.  అందుకే ఎక్కువ తమిళ ఇండస్ట్రీలోనే ఉంటుంది.  ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. 

 

ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్నారు.  ఆయన సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ  చిత్రంలో ఏనభై ఏళ్ల వృద్దురాలిగా కాజల్ కనిపించబోతుందట.  ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక ఉపధ్రవం ఎదురు అవుతూనే ఉంది.  తాజాగా భారతీయుడు 2 షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం సంబవించిన విషయం తెలిసిందే. షూటింగ్ జరుగుతుండగా క్రేన్ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైనట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్‌ కూడా గాయపడినట్లు సమాచారం.

 

ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ ఘటన చోటు  చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ ఘటనపై నటి కాజల్ కన్నీరు పెట్టుకున్నారు. తను ముగ్గురి స్నేహితులను కోల్పోయానని హీరో కమల్ హసన్ ట్వీట్ చేయగా, సడన్‌ గా జరిగిన క్రేన్ యాక్సిడెంట్‌పై కాజల్‌ కూడా స్పందించింది. ప్రమాద సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని… కొన్ని సెకన్ల వ్యవధిలో తాను తప్పించుకొని ఇలా ట్వీట్ చేయగలుగుతున్నాని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: