ఈ మధ్యనే తన పిల్లల కోసం రేణు దేశాయ్ హైదరాబాద్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ కొంటే ఆ అపార్ట్ మెంట్ ను పవన్ కళ్యాణ్ కొన్నాడు అంటూ జరిగిన ప్రచారాన్ని ఘాటుగా ఖండించింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె మళ్ళీ మరోసారి మీడియా వార్తలకు కేంద్ర బిందువుగా మారింది.   


వ్యక్తిగత సామాజిక అంశాల పై స్పందిస్తూ తన అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉండే రేణు అకీరా ఆద్య లతో జరుపుకునే సెలిబ్రేషన్స్‌ ఫొటోలు వీడియోలను ఆమె తరుచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు ఉంటుంది. తాజాగా కూతురు ఆద్య తీసిన ఒక ఫొటోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన రేణు ఆ ఫోటో పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.  


ప్రస్తుతం తన పిల్ల లతో  శ్రీలంక వెకేషన్‌లో ఉన్న రేణు దేశాయ్ రూమ్‌ లోని ఒక  కుర్చీలో కూర్చొని సముద్రం వైపు చూస్తున్నపుడు ఆద్య తన ఫోన్‌ తో ఫొటో తీసింది. ఆ ఫొటోలో రేణు దేశాయ్ ప్రతిబింబం కూడా పడింది. నిజమైన ఫొటోలో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తే అ ఫోటో లో కనిపించే ఆమె  ప్రతిబింబంలో విచారంగా ఉన్నట్లు  కనిపిస్తోంది. 


ఈ విషయం రేణు దేశాయ్ దృష్టి వరకు రావడంతో ఆమె ఆద్య తీసిన ఆ ఫోటో పై విలక్షణంగా వేదాంత ధోరణి లో స్పందించింది. ‘కెమెరా మన శరీరాన్నే కాదు మన నిజమైన ఆలోచనలను కూడా క్యాప్చర్ చేస్తుంది’ అని రేణు కామెంట్ చేసింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఆ ఫోటోను చూసిన అనేక మంది రేణు దేశాయ్ ఎందుకు విచారంగా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి రేణు ఆమధ్య అమెరికాలో ఉంటున్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ ను పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలువచ్చాయి. నిశ్చితార్ధం కూడ జరిగిన తరువాత ఈ వ్యవహారం ఎందుకు పెళ్లి పీటల వరకు రాలేదు అన్న విషయం సస్పెన్స్. ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకు వచ్చి రేణు దేశాయ్ ఇలా నైరాశ్యం తో ఉంది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: