ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని సెన్సేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. ఎంతో మంది అమ్మాయిలు పడక సుఖం ఇస్తే కానీ ఛాన్సులు దక్కించుకునే పరిస్థితి లేదని ఆమె ఆరోపించింది.  అలా మోసపోయిన అమ్మాయిల్లో తాను కూడా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతలోనే బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగూతూ వచ్చింది. ఇక శ్రీరెడ్డి ఉద్యమానికి పలువురు సినీ ఆర్టిస్టులు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చినా.. ఆమె నోటి దూల వల్ల పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి పూర్తిగా వ్యతిరేకం అయ్యింది.  దాంతో ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. 

 

ఇక్కడ లాభం లేదనుకొని చెన్నై మకాం మార్చింది.  అక్కడ నుంచి కూడా కొంతమంది సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూ వస్తుంది.  తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్ తిరిగి వచ్చేసిందని వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో పలువురు నటులపై మరోసారి తన నోటి దూలో పలు సంచలనాలు సృష్టిస్తుంది.  ఈ నేపథ్యంలో నటి కరాటె కళ్యాణి పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయని.. పోలీసు కేసు పెట్టింది. అంతకు ముందు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్పై  శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖలతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ శ్రీరెడ్డి సుదీర్ఘమైన వీడియో పోస్ట్ చేసింది. 

 

తాజాగా రాకేష్ మాస్టర్ కూడా శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. అనంతరం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  గతంలో శ్రీరెడ్డికి ఓ తండ్రి.. బాబాయిలా మద్దతు ఇచ్చానని.. ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసినపుడు ఆమెను అందరూ వ్యతిరేకించగా తాను మాత్రం సంపూర్ణ మద్దతు తెలిపి ఆమెకు ధైర్యం చెప్పానని అలాంటి తనను పట్టుకొని బండ బూతులు తిడుతూ ఉండటం సహించలేక పోయానని.. అందుకే కేసు పెట్టానని అన్నారు.  మొత్తానికి శ్రీరెడ్డి నోటి దూలతో ఈసారి కేసులు గట్టిగానే పట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: