టాలీవుడ్ లోకి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరంజీవి తన స్టామినా ఏంటో ఈ సినిమాలో చూపించారు.  ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు.  ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.  కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకాదరణ పొందలేక పోయింది.  ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ చిరు సరసన త్రిష నటిస్తోంది. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాకపోతే దీనిపై మాత్రం క్లారిటీ లేదు.  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నక్సలైట్ పాత్రలో మహేష్ కెమెరా అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  అయితే నక్సలైట్ పాత్రలో చెర్రీ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. అతడితో పాటు మహేష్ పాత్ర కాసేపు ఉండబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవల కొరటాల శివ, మహేష్‌ను కలిసి పాత్ర గురించి చెప్పినట్లు టాక్.  చిరంజీవి, కొరటాలతో మహేష్ బాబు కి ఎంతో అనుబంధం ఉంది.. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఆ పాత్రలో కనిపించేందుకు సిద్దమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

 

రామ్ చరణ్‌, మహేష్‌ ఎప్పటినుంచో మంచి మిత్రులు. కుటుంబపరంగానూ వీరిద్దరు పలు అకేషన్లలో కలుసుకుంటూ ఉంటారు. ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించిన విషయం తెలిసిందే.  ఇదే  జరిగితే మాత్రం మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగే పండగ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: