అల వైకుంఠ పురము లో సినిమా బాగా పెద్ద హిట్ ని అందుకుంది. అల్లూ అర్జున్, పూజా హెగ్దే కాంబినేషన్ తో వచ్చిన ఈ సినిమా గెలుపు ని అందుకుంది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్సినిమా కి చక్కటి కధ ని అందించి దర్శకత్వాన్ని అందించాడు త్రివిక్రం.
 
 
సినిమా తో మొదలు అందరూ సామజవరగమన అనడం. అయితే ఏ పార్టీ అయినా ఏ మ్యూజిక్ బ్యాండ్ అయినా సామజవరగమన తప్ప ఇంకేమీ లేదు. ఎక్కడ చూసినా అదే పాట మ్రోత మోగి పోతోంది. అయితే బన్నీ ఇంతకు ముందు తీసిన సినిమాల కంటే కూడా ఇది విరుద్ధం గా ఉండడం కూడా జరిగింది 
 
 
త్రివిక్రం సినిమా అంటే కాస్త విలువలు అలానే మంచి కధ ఉండడం పక్కా. మంచి టైమింగ్ లో చక్కటి సీన్స్ తో గొప్ప హిట్ ని అందుకోవడం నిజంగా అద్భుతం. అయితే సంగీతం విషయానికి వస్తే తమన్ చక్కటి ఆల్బం ని అందించాడు. దీనికి సాయం సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు అలానే రామ జోగయ్య శాస్త్రి గారు కూడా కలం జల్లుని కురిపించారు.
 
 
బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా నన్ను సుట్టూకుంటివే అంటూ స్టెప్ వేసిన బన్నీ పాట ఇప్పుడు హల్ చల్ అవుతోంది. ఇటు లిరిక్స్ బాగున్నాయి అని అంటే అటు టిక్ తాక్ లో హల్ చల్ అయ్యింది తాజాగా. బుట్ట బొమ్మ కి టిక్ టాక్ లో 36 మిలియన్ మంది వీక్షించడం నిజం గా ఓ పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. బుట్ట బొమ్మ పాట తో టిక్ టాకర్స్ చక్కగా చేస్తూ దానిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తున్నారు. నిజం గా బుట్ట బొమ్మ ఓ సెన్సేషన్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: