గత కొంత కాలంగా బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.  సెలబ్రెటీలను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలే కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో నటి తనూ శ్రీదత్తా గతంలో తనపై ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఆమె వెంటన పలువురు నటీమణులు, ఇతర సాంకేతిక విభాగానికి చెందిన వారు సైతం తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు.  ఇక తనూ శ్రీ దత్తాకు మద్దతుగా అప్పట్లో కంగనా రౌనత్ సైతం నిలిచారు.  అంతే కాదు ఇండస్ట్రీలో తనపై ఎన్నో ఇలాంటి వేధింపులు జరిగాయని.. వాటన్నింటిని తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. 

 

తాజాగా కంగనా రౌనత్ సోదరి రంగోలీ ఇటీవల కాలంలో వరుసగా సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఒకానొక సమయంలో కంగనా రనౌత్‌ను బెదిరించాడంటూ ఆమె సోదరి రంగోలీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అంతే కాదు   పీఎం నరేంద్రమోదీ నియంత అంటూ ఓ ఇంటర్వ్యూలో జావేద్‌ అక్తర్‌, మహేశ్ భట్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.  అంతే కాదు ఆ మద్య గత కొన్నిరోజులుగా  ఫిలింఫేర్‌ అవార్డులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేధికగా పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఆలియా భట్‌కు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ ఇవ్వడం సరికాదంటూ.. ‘గల్లీబాయ్‌’ చిత్రంలో ఆలియా నటన మధ్యస్థంగా ఉందంటూ రంగోలీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రచయిత జావెద్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.    గతంలో జావేద్‌ అక్తర్‌ కంగనను తన ఇంటికి పిలిపించుకున్నారు. హృతిక్‌కి సారీ చెప్పకపోతే ఊరుకోను అని బెదిరించాడు.   వాళ్లు చేసిన తప్పులు ఎవరికీ తెలియకపోవడం దురదృష్టం అని ఆవేదన చెందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: