యంగ్ హీరో నితిన్ నుంచి వస్తోన్న తాజా సినిమా భీష్మ. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న నితిన్ గ్యాప్ తీసుకొని ఆల్రెడీ ఛలో తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములుతో భీష్మ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఏ సినిమా కూడా హిట్ కాలేదు. తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన రవితేజ డిస్కో రాజా, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ రెండూ ప్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి అంచనాలు నితిన్ భీష్మ పైనే ఉన్నాయి.
ప్రస్తుతం సినిమాల కోసం జనాలు ఆవురావురు మంటున్నారు. దీంతో నితిన్ భీష్మకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సూపర్బ్ కలెక్షన్స్ వస్తాయి. అలాగే థియేటర్స్ లో పెద్దగా సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 550 - 600 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనాలు, రిపోర్టుల ప్రకారం భీష్మ మొదటి రోజు 4 నుంచి 4.5 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నితిన్ గత సినిమాలు చూస్తే ఏపీ, తెలంగాణలో తొలి రోజు శ్రీనివాస కళ్యాణం 2.8 కోట్లు, ఛల్ మోహన్ రంగ 2.6 కోట్లు, లై 2.15 కోట్లు, అ ఆ 5.8 కోట్లు సాధించాయి. ఇక ఇప్పుడు భీష్మ సోలో రిలీజ్ కావడంతో ఎన్ని కోట్లు రాబడుతుందో ? బాక్సాఫీస్ దగ్గర జర్నీ ఎలా స్టార్ట్ చేస్తుందో ? చూడాలి.