కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ మద్య వరుస సినిమాలతో దూకుడు పెంచారు. మారి తర్వాత సీక్వెల్ గా మారి 2 తో మంచి విజయం అందుకున్నాడు. ఇక అసురన్ సినిమాతో ఏకంగా 150 కోట్ల క్లబ్ లో చేరాడు.  ఈ మూవీ తెలుగు వెంకటేష్ రిమేక్ గా నారప్పగా తీస్తున్నారు.  అంతే కాదు తెలుగు లో ‘లోకల్ బాయ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ మూవీ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో చూస్తుంటే తెలుస్తుంది.  ఈ మూవీలో మెహ్రీన్, స్నేహలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ధనుష్ ద్విపాత్రాభినయంలో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. తాజాగా హీరో బెరింపులు వస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  


వీ క్రియేషన్స్‌ పతాకంపై మారి సెల్వరాజ్ దర్శకత్వం, కలైపులి ఎస్‌ ధాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కర్ణన్ అనే పేరుకు ఖరారు చేసారు. అయితే ఈ చిత్ర టైటిల్ ను నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1999లో జరిగిన కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్ణణల ఆధారంగా కర్ణన్ సినిమా రూపుదిద్దుకుంటోందని తిరునెల్వెల్లి, తూత్తుక్కుడి ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని బెదిరిస్తున్నారు. 

 

ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాగా, ఇటువంటి అభ్యంతరకర సీన్ తీసిన దర్శకుడు మారి సెల్వరాజ్‌తో పాటు నటించిన ధనుష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. పులిప్పడై సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు తమ సామాజిక వర్గం గురించి ఎలాంటి తప్పుడు సీన్స్ ఉన్నా కూడా తల నరికేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎలాంటి వాటికీ దారితీస్తుందో అని అంత భయపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: