తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్ మహేష్ బాబు.  ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రాలు పెద్దగా ఆదరణ లేకపోయినా.. మురారి, ఒక్కడు, అతడు చిత్రాలలో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం రికార్డుల మోత మోగించింది. కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వచ్చాయి.  ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుకి మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. గత కొంత కాలంగా మహేష్ బాబు నటిస్తున్న ప్రతి చిత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

 

తాజాగా మహేష్ బాబు ఎమోషన్ తో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నాడు. ప్రముఖ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భగా విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు.  ఆ తర్వాత మహేష్ బాబు మాట్లాడుతూ ఎంతో ఎమోషన్ కి గురి అయ్యారు. 

 

తాను నటించిన ప్రతి చిత్రం మార్నింగ్ షో నాన, విజయనిర్మల గారు చూసేవారని.. తర్వాత నాన్న ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత.. ఆవిడ కూడా ఎంతో సంతోషంగా శుభాకాంక్షలు చెప్పేవారు.  ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా చిత్రాన్ని చూసిన నాన్నగారు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు... ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.. అయితే, ఆమె చనిపోయిందన్న విషయం తర్వాత గుర్తుకొచ్చింది నేను చాలా బాధపడ్డాను.. అంటూ కంటతడి పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: