రేపు విడుదల కాబోతున్న  ‘భీష్మ’ మూవీకి భారీ ఓపెనింగ్స్ తీసుకురావడానికి హీరో నితిన్ తో పాటు దర్శకుడు వెంకీ కుడుముల కూడ విపరీతంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈమధ్య నాగశౌర్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకీ కుడుమల పై చేసిన కామెంట్స్ కు వెంకీ కుడుమల చాలా వ్యూహాత్మకంగా స్పందించాడు. తనను మోసం చేసినా భరించేవాడినని కానీ  తన తల్లిని  వెంకీ మోసం చేశాడని తన తల్లి ఇచ్చిన కారును కూడా వాడకుండా పడేశాడని అంటూ నాగశౌర్య వెంకీ కుడుమల పై డైరెక్ట్ ఎటాక్ చేసిన విషయం తెసిందే.


ఇప్పుడు కొందరు మీడియా వర్గాలు నాగశౌర్య కామెంట్స్ ను వెంకీ కుడుముల దృష్టికి తీసుకురావడంతో దీనిపై ఈ దర్శకుడు ఎట్టకీలకు రియాక్ట్ అయ్యాడు. "నాకు తెలిసింది ఒక్కటే. సినిమా చేసుకుంటూ వెళ్లిపోతాను. నా స్టయిల్ ఎవరికైనా నచ్చకపోతే నేనేం చేయలేను. ఫస్ట్ సినిమా తీశాను, బాగా వచ్చింది. ఇప్పుడు రెండో సినిమా తీశాను, బాగా ఆడాలి. నెక్ట్స్ మూడో సినిమాకు షిఫ్ట్ అయిపోతాను. అంతకుమించి ఇంకేం ఆలోచించను."అంటూ మీడియా వర్గాలకు డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా తప్పించు కోవడానికి ప్రయత్నించాడు. 


ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మరొక ట్విస్ట్ ఇస్తూ చిరంజీవి డైలాగ్ ఒకటి తనకు చాలా ఇష్టమంటూ ఆ డైలాగ్ ను మీడియా పై ప్రయోగించి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.  "నేను చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్. ఆయన  ఈ మధ్య ఓకే  డైలాగ్ చెప్పారు. మంచి మైక్ లో చెప్పమన్నారు, చెడు చెవిలో చెప్పమన్నారు. నేను అదే చేస్తాను. మనస్పర్థలు ఎవరికైనా ఉంటాయి. మన పర్సనల్ ఫీలింగ్స్, ఇంట్లో వ్యవహారాలపై బయట జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదని వందశాతం నమ్ముతాను’ అంటూ కామెంట్ చేసి ఏకంగా మీడియా వర్గాలకు మైండ్ బ్లాంక్ చేసాడు. త్వరలోనే తన మూడవ సినిమా ప్రారంభం అంటూ హీరో ఎవరు అన్న విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఈ డైరెక్టర్ ప్రదర్శించిన తెలివితేటలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: