టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న నటి సమంత అక్కినేని. ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఎం మాయ చేసావె’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా మంచి పొజీషన్లోకి వెళ్లింది. ఏం మాయ చేసావే లో నటించిన తన సహనటుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్న ఆమె ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తుందని అందరూ భావించారు. కానీ వివాహం జరిగిన తర్వాతనే సమంత వరుస విజయాలు అందుకుంటూ జోరు కొనసాగిస్తుంది.
ఈ మద్య శర్వానంద్ - సమంత జంటగా నటించిన జాను సినిమా కాస్త నిరాశపరిచింది. ఈ మూవీలో ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయింది. కాకపోతే ఈ మూవీ తమిళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. తాజాగా సమంత తమిళంలో `కాత్తువక్కుల రెందు కాదల్` అనే సినిమాను సమంత అంగీకరించింది. ఈ మూవీ నయనతార బాయ్ ఫ్రెండ్ ఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్నేష్, నయన్ తో ఉన్న సాన్నిహిత్యంతో పాటు ఈ మూవీ కథ సమంతకు చాలా బాగా నచ్చిందట. ఈ మూవీ ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటిస్తున్నారు.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ``కాత్తువక్కుల రెందు కాదల్` సినిమా కథ నాకు చాలా నచ్చింది. ఆసక్తికరమైన కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో నా వద్దకు ఈ ఆఫర్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయనతార లాంటి అగ్ర తారలు ఉన్నారు.. వారితో పోటీ పడి నటించాలి.. అందుకే నేను ఇష్టంగా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా అని అంటుంది. మరి ఈ సినిమాతో నయన్, సమంత హిట్ కొడతారా లేదా చూడాలి.