సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు సంవత్సరాల నుండి వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను మరియు మహర్షి అదే విధంగా తాజాగా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. దీంతో మంచి జోరు మీద ఉన్న మహేష్ బాబు నెక్స్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పనిలో వంశీ ఫుల్ లీనమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ తల్లి దివంగత విజయనిర్మల పుట్టినరోజు సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు మరియు కృష్ణ మహేష్ బాబు అదేవిధంగా ఇంకా చాలా మంది సినిమా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మహేష్ బాబు తన తల్లి విజయ నిర్మల గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే విజయ నిర్మల గారు చాలా డైనమిక్ పర్సన్. నా సినిమాలు రిలీజైన ప్రతి సారి నాన్నగారు మొదట ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత విజయ నిర్మల గారు మాట్లాడేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజైన తర్వాత కూడా నాన్న ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతారేమోనని ఒక్క క్షణం పొరపాటు పడ్డాను.

 

కానీ ప్రస్తుతం ఆవిడ లేరు కదా అని చాలా బాధపడ్డాను అని మహేష్ తెలిపాడు. విజయనిర్మల గారిని చాలా మిస్ అవుతున్నట్లు తెలిపాడు. ప్రతి సంవత్సరం విజయ నిర్మల జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులుగా అందరూ చాలా ఘనంగా నిర్వహించే వాళ్ళం కానీ ప్రస్తుతం ఆమె విగ్రహావిష్కరణ ద్వారా ఆమెకు నివాళులు అర్పిస్తున్న ట్లు మహేష్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో మహేష్ బాబు గిన్నిస్ రికార్డు ఫలకాన్ని ఆవిష్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: