యువ దర్శకుడు వెంకీ కుడుముల ఛలో సినిమాతో ఒక్క సారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకీ ఛలో సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మిక టాలీవుడ్లో ఇప్పుడు తిరుగులేని స్టార్ అయిపోయింది. ఇక ఇప్పుడు నితిన్తో వెంకీ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమా శివరాత్రి కానుకగా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సందర్భంగా వెంకీ మాట్లాడుతూ తాను పలు కీలక విషయాలు వెల్లడించారు.
తాను రెండో సినిమా చేసే లోపే రష్మిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. అసలు రష్మిక ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను. కథ రాసుకునేటప్పుడు కూడా ఆమె తో కలిసి పనిచేయడంతో ఆమె ఎక్స్ప్రెషన్స్ గుర్తుకు రావడం వల్లే ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశానని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే వెంకీ కుడుముల మైత్రీ మూవీస్ బ్యానర్లో తాను ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఈ సినిమా కోసం కథ కూడా రెడీ చేసుకుంటున్నట్టు చెప్పారు.
ఇక మైత్రీ మూవీస్ ఇప్పటికే మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్రయత్నలు చేస్తోంది. మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాలన్నదే మైత్రీ వాళ్ల ప్లాన్. ఈ క్రమంలోనే వెంకీ కుడుముల - మైత్రీ కాంబోలో తెరకెక్కే సినిమాలో మహేష్ బాబే హీరో అంటూ ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో ఇప్పటికే ప్రచారం స్టార్ట్ అయ్యింది.
మైత్రీ వాళ్లు కూడా ఇప్పటికే ఓ సినిమా కోసం మహేష్కు అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నారట. దీంతో వాళ్లు వచ్చే యేడాదే మహేష్తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మరి మహేష్ - వెంకీ కుడుముల కాంబోలో సినిమా వార్తల్లో ఎంత వరకు నిజం ఉంటుందో ? భీష్మ రిలీజ్ అయ్యాక క్లారిటీ రానుంది.