మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడా.. అల వైకుంఠపురంలో సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన గురుజీ ఈ సినిమాతోనే బీటౌన్ లో తన మార్క్ చూపించాలని ఆశపడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే గురూజీ బాలీవుడ్ లో డైరెక్టర్ ట్రై చేయడంలేదట. 

 

ఫ్రెండ్ షిప్ ఫ్రెండ్ షిప్పే.. బిజినెస్ బిజినెస్సే. త్రివిక్రమ్ ఇప్పుడు ఇదే సూత్రం ఫాలో అయ్యాడు. ఎంత స్నేహం ఉన్న మనీ మ్యాటర్స్ లో మాటల మాంత్రికుడు ఫర్ ఫెక్ట్ క్లారిటీగా ఉన్నాడట. అల వైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ లో రిమేక్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ లో తనకు వాటా ఇవ్వాలని త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, అల్లు అరవింద్ ని డిమాండ్ చేస్తున్నట్టు టాక్.

 

కొద్దిరోజులుగా అల వైకుంఠపురములో సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలా.. రైట్స్ అమ్మేయాలా.. అనే విషయంలో మేకర్స్ మధ్య డిస్కషన్స్ సాగుతున్నాయి. అయితే ఫైనల్ గా సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట.

 

త్రివిక్రమ్ రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి రిమేక్ చేస్తే వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గురూజీ మనీ కాకుండా రీమేక్ లో తనకు నిర్మాతగా వాటా ఇవ్వాలని కోరాడట. 

 

అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడా అనేది పక్కన పెడితే నిర్మాత మాత్రం ఉంటాడట. ఇంతకుముందు నితిన్ హీరోగా చల్ మోహన రంగచిత్రాన్ని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. మొత్తానికి తను బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రంతోనే మాటల  మాంత్రికుడు బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి అల వైకుంఠపురములో నటించబోయే స్టార్స్ ఎవరనేది అల్లు అరవింద్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: