కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని చెప్పొచ్చు. నాలుగైదు సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం అందుకుంది. ఇక రేపు అనగా శుక్రవారం భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక. నితిన్ తో మొదటిసారి జోడీ కట్టిన ఈ అమ్మడు ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అన్నట్టు చెబుతుంది. భీష్మ సినిమా టీజర్, ట్రైలర్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. 

 

నితిన్, రష్మిక జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇక హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుండి రష్మిక మీద ఏదో ఒక ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. మాములుగా అయితే ట్రోల్స్ గురించి అందరు నెగటివ్ గా ఆలోచిస్తారు రష్మిక మాత్రం అలా కాదు. తనని ఎంత ట్రోల్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తా అంటుంది ఈ అమ్మడు. ట్రోల్స్ గురించి మీరెలా స్పందిస్తారని రష్మికను అడుగగా తను చేసిన ప్రతి సినిమాకు ట్రోల్స్ కామన్ అయ్యాయి. ఓ విధంగా తను ఈ పొజిషన్ కు వచ్చేందుకు ఆ ట్రోల్స్ కూడా కారణమని నమ్ముతా అంటుంది రష్మిక. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో నువ్వు చేసింది యాక్టింగ్ అనుకుంటున్నావేమో అది ఓవరాక్టింగ్ అని కొందరు.. ఇక భీష్మ సినిమా గురించి రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. వీటన్నిటి కంటే విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ పై చాలా పెద్ద రూమరే వచ్చింది. వాటి హర్ట్ అయ్యి తను బాధపడటం కాకుండా ఎంజాయ్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తా అని చెప్పింది రష్మిక. ప్రస్తుతం తెలుగులో రష్మిక ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబో మూవీతో పాటుగా సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: