టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య దర్శకుడు వెంకీ కుడుముల మధ్య రేగిన వివాదం కాస్త హాట్ టాపిక్ అయున సంగతి తెలిసిందే. గతంలో ఆ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కి మంచి సక్సస్ అయిన 'ఛలో' స్క్రిప్ట్ క్రెడిట్ విషయంలో నాగశౌర్య మొత్తం తన ఖాతాలో వేసుకోవడంతో డైరెక్టర్ కి కాలిపోయింది. ఛలో స్క్రిప్ట్ లో తన సహకారం కూడా చాలా ఉందని అయితే వెంకీ క్రెడిట్ మొత్తం కొట్టేశాడని హీరో నాగ శౌర్య చేసిన సంచలన వ్యాఖ్యాలు పెద్ద దుమారమే రేపాయి. అంతేకాదు నాగశౌర్య మళ్లీ మళ్ళీ వెంకీ కుడుములను పబ్లిక్ వేదికలపై టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక తన కాంపౌండ్ లో అడుగు పెట్టనివ్వనని వెంకీ ఒక మోసగాడు అని చెలరేగిపోయాడు శౌర్య.

 

అయితే ఈ వ్యాఖ్యలను వెంకీ సీరియస్ గా తీసుకోలేదు. తన సినిమా భీష్మ బిజీలో ఉండి ఈ గోలేది పట్టించుకోలేదు. ఇక వెంకీ-నాగశౌర్య మధ్య వివాదం ఉందన్న విషయం కూడా నాగౌశర్య బయట పెడితేనే తెలిసింది. అయితే తాజాగా భీష్మ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా వెంకీ కుడుములను ఆ వివాదం గురించి మీడియా అడిగినప్పటికి వెంకీ నో కామెంట్స్ అన్నాడు. 

 

అయితే వెంకీ కుడుమలు ఇప్పుడిప్పుడే దర్శకుడిగా టాలీవుడ్ లో ఎదుగుతున్నాడు. మేకర్ గా అతనికి ఇంకా చాలా ఫ్యూచర్ చూడాలి. అందుకే ఈ వివాదం పై వెంకీ స్పందించడం లేదు అని అందరూ అంటున్నారు. ఇక వాస్తవంగా చిత్ర పరిశ్రమలో వివాదాలతో చెడ్డపేరు తెచ్చుకోవడానికి ఎవరికీ ఇష్టముండదు. అందుకే సాధ్యమైనంతవరకు సమస్యలని పెద్దవి చేసుకోరు. అయితే నాగశౌర్య ఎందుకనో పొరపాటున నోరు జారి మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇప్పుడు అదే తప్పు వెంకీ చేయకపోవడం మంచిదేనన్న అభిప్రాయంలో అందరూ ఉన్నారు. మొత్తానికి వెంకీ తొందరపడి నోరు జారితే నితిన్ కి దెబ్బ పడేది.

మరింత సమాచారం తెలుసుకోండి: