యువ సామ్రాట్ నాగ చైతన్య ,సాయి పల్లవి,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం లవ్ స్టోరి. ఇప్పటివరకు 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి నుండి దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈషెడ్యూల్ లో ఓ పాట తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా ఇటీవల విడుదలైన ఈచిత్రంలోని మ్యూజికల్ ప్రివ్యూ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకొని ఆ అంచనాలను మరింతగా పెంచింది.
 
ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 5.5కోట్లకు దక్కించుకోగా తెలుగురాష్ట్రాల్లో కూడా ఈ  హక్కుల కోసం ఫుల్ డిమాండ్  ఏర్పడింది. ఇదిలావుంటే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకానుందని వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం మే 22 న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 
 
రాజీవ్ కనకాల,దేవయాని, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక గత ఏడాది మజిలీ, వెంకిమామ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన  చైతన్య, లవ్ స్టోరి హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు. అయితే ఈ సినిమా తరువాత నాగ చైతన్య ఇంతవరకు తన తదుపరి చిత్రానికి సైన్ చేయలేదు. కాగా సాయి పల్లవి ఈసినిమా తోపాటు  వేణు ఉడుగుల డైరెక్షన్ లో రానాతో కలిసి విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: