టాలీవుడ్ లో వరుసగా సినిమాలు తీస్తూ సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా తమ బ్యానర్ లను కొనసాగిస్తున్న వారు ఉన్నారు. వాళ్లలో అతి తక్కువ టైమ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా, సక్సెస్ ఫుల్ గా తమ బ్యానర్ వాల్యూను నిలబెట్టుకుంది మాత్రం ఖచ్చితంగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలే అని చెప్పాలి. ఇంతటి సక్సెస్ ఫుల్ బ్యానర్ కు తర్వాత ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి. హిట్, ఫ్లాపులు సమానంగా తీసుకున్న మైత్రీ బ్యానర్ ఇప్పుడు ఓ భారీ టార్గెట్ ను సెట్ చేసిందని ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ లో సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను పెట్టి బాలీవుడ్ లో తొలి సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తెలుగులో తొలి చిత్రమే మహేశ్ తో తీసి హిట్ సాధించినట్టు బాలీవుడ్ లో కూడా సల్మాన్ తో సినిమా తీయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తమ వంతు ప్రయత్నంగా సల్మాన్ కు సన్నిహితుడైన ఒకప్పటి హీరో ద్వారా సల్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు మైత్రీ మూవీ మేకర్స్2 అనే బ్యానర్ స్థాపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ బ్యానర్లో తీసే సినిమాలకు నవీన్, రవి మాత్రమే నిర్మాతలుగా కొనసాగుతారని మోహన్ చెరుకూరి దూరంగా ఉంటారని సమాచారం.

 

 

తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేశ్ తో శ్రీమంతుడు సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ సాధించారు. తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్. మూడో సినిమాగా రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమా నాన్ బాహుబలి రికార్డులతో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ వార్తలపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: