టాలీవుడల్లో టైర్ 2 హీరోలలో టాప్ హీరోగా ఉన్న నితిన్ - రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన సినిమా భీష్మ. నితిన్ గతకొద్దిరోజులుగా నటిస్తున్న సినిమాలు అన్ని వరుసపెట్టి ప్లాప్. అవుతున్నాయి. దీంతో నితిన్ మార్కెట్ కూడా సరిగా స్టెబిలైజ్ కాలేదు. నితిన్ ఇటీవల నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఛలో లాంటి బ్లాక్బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ఇటీవల టాలీవుడ్ లో వరుస పెట్టి టాప్ ఛాన్సులు దక్కించుకుంటున్న రష్మిక హీరోయిన్ కావడంతో భీష్మపై మంచి అంచనాలు ఉన్నాయి.
నితిన్ నుంచి సంవత్సరంన్నర తర్వాత వస్తున్న చిత్రం కావడం అలాగే విడుదలకు ముందే పాటలు మంచి హిట్ అవ్వడంతో ఈ చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్లు స్టార్ట్ అయ్యాయి. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యే సరికి జస్ట్ ఒకే అని చెప్పొచ్చు.సింగిల్స్ యాంథంలో భాగంగా హీరోయిన్ హెబ్బా క్యామియోలో కనిపించడం విశేషం. వెంకీ కుడుముల కథలో ఫన్ బాగా జనరేట్ చేశాడు.
అలాగే కథలో భాగంగా వచ్చే పలు కామెడీ సీన్లు బాగున్నాయి. అన్నింటికంటే ఫస్టాఫ్ లో నితిన్ - రష్మిక మందన్న మధ్య వచ్చే కెమిస్ట్రీ సూపర్బ్ గా వచ్చింది. ఇక కథలో మెయిన్గా వ్యవసాయం అనే కాన్సెప్ట్ డీసెంట్ గా సాగే కథనం పరవాలేదనిపిస్తాయి. అలాగే అశ్వథ్థామ ఫేమ్ విలన్ రోల్ లో కనిపించిన జిష్షు గుప్త మరోసారి తనలోని విలన్ యాంగిల్ ను ప్రెజెంట్ చేసారు.
ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు కామెడీ, రొమాంటిక్ సీన్లు, నితిన్ - రష్మిక కెమిస్ట్రీతో సినిమాను నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ను ఒక్కసారిగా ఆసక్తిగా మార్చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. మరి ఇది సెకండాఫ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తుందేమో చూడాలి.