తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కామెడీ షో ‘జబర్దస్త్’. సుమారు ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ షో బాగా క్లిక్ కావడంతో.. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ను కూడా ప్రారంభించారు. ఈ కామెడీ షోకి గత కొన్నేళ్లుగా జడ్జ్‌‌‌గా వ్యవహరిస్తూ ఎక్స్ ట్రా ఫన్ అందిస్తున్న స్మైలీ హీరోయిన్ రోజా అయితే న‌వ్వుల న‌వాబుగా పేరు తెచ్చుకున్నాడు నాగ‌బాబు. అయితే ఇటీవ‌ల కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో జబర్దస్త్ కామెడీ షో చాలా రకాలుగా వార్తల్లోనే ఉంది. ఈ షో ఆగిపోతుందని కొందరు.. కాదు కాదు పాత టీం లీడర్స్ అంతా వెళ్లిపోయి కొత్త వాళ్లు వస్తున్నారని మరికొందరు ప్రచారం చేశారు. 

 

కానీ, ఈ రూమ‌ర్స్‌కి చెక్ పెడుతూ జ‌బ‌ర్ద‌స్త్ షో మ‌రింత ఎక్స్‌ట్రా ఫ‌న్‌తో దూసుకుపోతోంది. కేవలం ప్రేక్షకులను నవ్వించడమే ధ్వేయంగా ఫ్రెష్ కంటెంట్‌తో హిలేరియస్ కాన్సెప్ట్‌లతో ‘జబర్దస్త్’ షోను నిర్వహిస్తున్నారు. ఇక జ‌బర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ప్రముఖ ఛానల్ జీలో నాగబాబు  అదిరింది అనే కొత్త కామెడీ షోని ప్రారంభించారు. అయితే లోగో దగ్గర నుంచి.. స్కిట్ ల వరకూ జబర్దస్త్ కి కొనసాగింపులా ఉంది తప్ప మరో కొత్త షో చూసిన అనుభూతి దక్కలేదని వీక్షకులు పెదవి విరిచారు. మ‌రోవైపు జ‌బ‌ర్ద‌స్త్‌లో నాగబాబు వెళ్లిపోయినా.. రోజా ఒక్క‌రే జ‌డ్జ్‌గా వ్య‌వ‌రిస్తున్నా కూడా.. టిఆర్పీ రేటింగ్స్‌‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో రోజా హిట్ షోతో బాగానే కొన‌సాగుతోంది. 

 

కానీ, అటు నాగ‌బాబు అదిరింది షో  రేటింగ్స్ విషయంలో ఊహించినంతగా రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. ఈ క్ర‌మంలోనే ఈ షో ఫ‌ట్ అని.. నాగ‌బాబు ప‌రిస్థితి ఏంటో అని కూడా కామెంట్లు చేస్తున్నారు కొంద‌రు. అయితే ఈ సమయంలో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. వాస్త‌వానికి  ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు నాగబాబు. 

 

అలాంటి సమయంలో ఈయన కెరీర్‌కు మళ్లీ ఊపిరి ఊదింది జబర్దస్త్ కామెడీ షో. ఇక ఏవో కార‌ణాల వ‌ల్ల వెళ్లిపోయారు స‌రే. కానీ వెళ్లేప్పుడు మల్లెమాలపై చాలా విమర్శలు చేసాడు నాగబాబు. ఏడేళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేసారన్నట్లుగా మాట్లాడాడు ఈయన. అంతేకాదు కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. దీంతో నాగ‌బాబు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ వైపు చూసినా  నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆయన రీఎంట్రీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: