ఒక లైలా కోసం సినిమాతో నాగచైతన్యతో  జోడీ కట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తనదైనా అందం అభినయంతో వరుస అవకాశాలు అందుకుంటూ... ఎంతో క్రేజ్ సంపాదిస్తూ వచ్చింది. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది పూజా హెగ్డే. ప్రస్తుతం దర్శక నిర్మాతలు అందరి చూపు పూజా హెగ్డే వైపే ఉంది. టాలీవుడ్లోని స్టార్ హీరోల అన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఇక ఈ అమ్మడు తనదైన నటనతో అందంతో అందరిని ఆకట్టుకుంటూ వరుస విజయాలను కూడా సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే వరుస అవకాశాలు వచ్చి చెంత వాలగా..  ప్రస్తుతం బిజీగా ఉంది పూజా హెగ్డే. 

 

 

 అయితే పూజా హెగ్డే ఇప్పటికే హాట్రిక్ సాధించి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. అరవింద సమేత లో ఎన్టీఆర్ తో జోడీ కట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత మహర్షి మహేష్ బాబు తో జోడి కట్టిన మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇక తాజాగా అలా వైకుంఠపురములో  సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి మరో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది  పూజా హెగ్డే. అయితే పూజా హెగ్డే ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో నటించిన పూజా హెగ్డే... ఇక తాజాగా  అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురములో సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నట్లు  తెలుస్తోంది. 

 

 

 అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా...  ఇక తాజాగా మరోసారి హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లు తాజా ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్..ఈ  సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో  చేయనున్నట్లు ప్రకటన చేశారు. కాగా ఈ సినిమాలో మరోసారి పూజ హెగ్డే నే  తీసుకోవాలి అని చిత్రబృందం భావిస్తోన్నట్లు  సమాచారం. దీని కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. దీనికి సంబంధించి ఫిల్మీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నీ కుదిరితే పూజా హెగ్డే ఈ సినిమాలో నటించ బోతోంది అని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల్లో వెలువడనుంది గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: