ఈ ఏడాది సంక్రాంతి కి మంచి సినిమాలే వచ్చాయి. మహేష్ సినిమా ఏమో గాని, అల్లు అర్జున్ సినిమా మాత్రం సంక్రాంతికి మంచి వినోదాన్ని అందించింది అనే చెప్పాలి. ఎంత మంచివాడవు రా, రజని కాంత్ సినిమా దర్బార్ కూడా కాస్త పర్వాలేదు అనిపించాయి. దీనితో సంక్రాంతి ఈ ఏడాది బాగానే ఉంది. కాని సంక్రాంతి తర్వాత వచ్చిన ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. సంక్రాంతి తర్వాత, రవి తేజా నటించిన డిస్కో రాజా విడుదల అయింది. 

 

చాన్నాళ్ళ తర్వాత వచ్చిన ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక జాను సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి రాడ్డు అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎంత మాత్రం ఆకట్టుకోలేదు. ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు ప్రేక్షకులు. చిన్న సినిమా లు ఒకటి రెండు బయటకు వచ్చాయి గాని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇలా సంక్రాంతి తర్వాత వినోదం కోసం చూసిన ప్రేక్షకుల కు మంచి సినిమా దొరకలేదు. 

 

ఆ కరువుని నితిన్ తీర్చాడు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. భీష్మ సినిమా హమ్మయ్య అనిపించింది అంటున్నారు. ఏ సినిమా లేక అల వైకుంఠపురములో సినిమానే చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఆ రేంజ్ లో కిక్ ఇచ్చింది అంటున్నారు. సినిమా అన్ని విధాలుగా ఆకట్టుకుందనే టాక్ వినపడుతుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఉంది. నితిన్ కూడా ఈ సినిమా పెట్టుకున్న ఎన్నో ఆశలను తీర్చింది అంటున్నారు ప్రేక్షకులు. ప్రేమికులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది అంటున్నారు. రష్మిక నటన కూడా చక్కగా ఉందని, పొగరు గా బాగా నటించిందనే చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: