టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. ఛలో సినిమాతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని విమర్శల ప్రసంశలు దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచాయి. మంచి హైప్తో, భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఎందుకంటే హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది దానికి తోడు త్రివిక్రమ్ తో తీసిన “అఆ” తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కూడా నితిన్ కొట్టలేదు.దీనితో ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. అయితే ఇప్పటికే యూఎస్లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని, కామెడీ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. కామెడీ టైమింగ్ డ్యాన్స్ తో ఇరగదీశాడని ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో గా కథను నడిపించడానికి టాక్ వస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు.
ఇక సినిమా ప్లస్, మైనస్ల విషయానికి వస్తే.. నితిన్ మరియు రష్మికాల మధ్య కెమిస్ట్రీ, నితిన్,వెన్నెల కిషోర్ ల మధ్య కామెడీ, పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్, హిలేరియస్ కామెడీ ట్రాక్స్ సినిమా బాగా ప్లస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే కాస్త అంచనా వెయ్యగలిగే కథనం, అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం.. ఈ రెండూ సినిమా మైనస్లుగా నిలిచినట్టు తెలుస్తోంది. అయితే భీష్మలో కొన్ని సన్నివేశాలు గత చిత్రాలను పోలి ఉంటున్నాయని అంటున్నారు. అయినప్పటికీ దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ, కమర్షియల్ అంశాలతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి.