హీరోయిన్ రేఖ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈ అమ్మడు చేసినవి కొన్ని సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు మనసులో మాత్రం స్థానం సంపాదించుకుంది. తనదైన అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఆనందం సినిమాలో  హీరోయిన్గా నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది రేఖ. ఇక ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తన చిలిపి నవ్వుతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ అమ్మడు. ఇంకా ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. ముఖ్యంగా నందమూరి తారకరత్న హీరోగా నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో... నటించింది ఈ అమ్మడు. 

 

 

 ఇక ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటున్నాయి. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోవడంతో హీరోయిన్ రేఖా కి అవకాశాలు కూడా తగ్గాయి. ఇక ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాలో గెస్ట్ పాత్రల్లో కూడా నటించింది రేఖ. ఇక ఆ తర్వాత తెలుగు తెరపై ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ సోషల్ మీడియాలో కూడా దర్శనం ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైంది రేఖ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ. 

 

 

 ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు బతికున్నప్పుడే చచ్చిపోయారు అంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే తనకు కూడా ఎదురైంది అంటూ చెప్పుకొచ్చింది రేఖ. తాను బ్రతికి ఉన్నప్పుడే శ్రద్ధాంజలి ఘటించారు అని చెప్పింది . అయితే దానికి తాను బాధపడలేదని  తాను బతికున్నప్పుడే శ్రద్ధాంజలి అంటే ఎంతో ఆనందపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నేను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో రెండు మూడు రోజులు గడిపి ఆ తర్వాత నేను చనిపోయాను  అంటూ వచ్చిన వార్త న్యూస్ పేపర్ ను వాళ్ళ  ముందు ఉంచి వెళ్ళిపోతాను. దీంతో వాళ్ళు షాక్ అవుతారు అంటూ  చమత్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: