శ్రీను వైట్ల దర్శకత్వంలో  ఆకాష్ హీరోగా వచ్చిన చిత్రం ఆనందం. ఈ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రేఖ వేదవ్యాస్. అయితే ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది తన అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకుంది. ముఖ్యంగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అయితే మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న హీరోగా నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.ఈ సినిమాను  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. 

 

 

 అయితే అప్పట్లో ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందన్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా పాటలను వింటూ ఉంటారు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోవడంతో... ఈ అమ్మడికి అవకాశాలు కూడా సరిగ్గా రాలేదు. దీంతో టాలీవుడ్ లో కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే చేసింది. తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో కూడా నటించింది రేఖ వేదవ్యాస్. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అతిథి పాత్ర చేసింది. 

 

 

 అయితే తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైనది  రేఖ వేదవ్యాస్ . ఎన్నో రోజుల పాటు అటు సినిమాలలో ఇటు సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించని రేఖ వేదవ్యాస్ ఒక్కసారిగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో  హాజరు కావడంతో అభిమానులు మురిసి పోయారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది . ఈ సందర్భంగా ఓ సినిమా సమయంలో అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు విశాఖపట్నం నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెబితే ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదని చెప్పి తనను రైల్లో పంపించారని.. ఆ తర్వాత పొద్దున కొంతమంది కెమెరామెన్ కూడా వచ్చేసరికి ఎలా వచ్చారు అని అడిగితే ఫ్లైట్లో వచ్చామని చెప్పారు అంటూ చెప్పారని..  దీంతో అప్పుడు తనకు అర్థమైందని తనను ఏప్రిల్ ఫూల్ చేసి  మోసం చేశారు అంటూ నవ్వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: