నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ కుమారుడు మహతి సంగీతం అందిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈసినిమా పోస్టర్స్, టీజర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అలాగే లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వంటి హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత యువ హీరో నితిన్ గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.
దీంతో హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది దానికి తోడు త్రివిక్రమ్ తో తీసిన “అఆ” తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కూడా నితిన్ కొట్టలేదు. అయితే ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. ఇప్పటికే యూఎస్లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ఇక సినిమాలో నితిన్ భీష్మ క్యారెక్టర్ లో సరికొత్తగా దర్శనమిచ్చాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ని బయటపెట్టిన వెంకీ కుడుముల మరోసారి అదే తరహాలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు సినిమాలో యాక్షన్ ని కూడా సరికొత్తగా ప్రజెంట్ చేశాడు.
మరోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు.. భీష్మ సూపర్ హిట్ అని, నితిన్ ఖాతాలో ఎట్టకేలకు విజయం చేరిపోయిందంటూ ట్వీట్లు పెడుతున్నారు. కామెడీ కేక పుట్టించిందని, ఫస్టాఫ్లో కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని ఇచ్చారని చెబుతున్నారు. కామెడీ టైమింగ్ డ్యాన్స్ తో ఇరగదీశాడని ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో గా కథను నడిపించడానికి టాక్ వస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు. అలాగే ఫస్టాఫ్ , సెకండాఫ్ రెండూ అదిరిపోయాయి అంటూ మరికొందరు ట్వీట్లు పెడుతున్నారు. మరి నితిన్ వీటిని ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి.