తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్స్ తో గ్లామర్ క్విన్ గా వెలిగిపోయింది కలువ కళ్ల సుందరి కాజల్.  ఈ అమ్మడు మెగా హీరోలందరి తో నటించింది.  ఈ తరం హీరోలతో తప్ప.. అయితే కొంత కాలంగా తెలుగు లో కాజల్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఎక్కువగా తమిళనాట ఫోకస్ చేసింది.  తాజాగా ఈ అమ్మడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ సీక్వెల్ లో నటిస్తుంది.  ఈ చిత్రం షూటింగ్ సమయంలో నిన్న పెద్ద ప్రమాదం జరిగి ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు.  లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ చెన్నైలో జరుగుతుంది. కీలక సన్నివేశాల కోసం వేసిన భారీ సెట్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే.

 

క్రేన్‌ కూలడంతో ముగ్గురు అసిస్టెంట్స్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సందర్భంగా కాజల్ చాలా ఆవేదన పడింది.    మాతోపాటు పనిచేసే కృష్ణ, చంద్రన్‌, మధును నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో కోల్పోవడం బాధగా ఉంది. నా గుండెలోని బాధని బయటపెట్టడానికి మాటలు రావడం లేదు.  కొన్ని క్షణాల వ్యవధిలోనే నేను ప్రమాదం నుంచి తప్పించుకుని   ఆ ఒక్క క్షణం, నాకు కాలం, జీవితం విలువ తెలిసింది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు.  ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం.

 

నా బాధ కన్నా, వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ.  ఇప్పటి వరకు షూటింగ్స్ లో చిన్న ప్రమాదాలు జరగడం సహజం.. అవి పెద్దగా పట్టించుకోలేదు.  కానీ నిన్న జరిగిన ప్రమాదం నా జీవితాంతం గుర్తుండి పోతుంది.. ఆ ప్రమాదం జరిగిన తర్వాత నాకు జీవితం విలువ ఏంటో తెలిసింది.  ఏది ఏమైనా నిన్న జరిగిన విషాదం ఆ ముగ్గురు మరణం తీరని లోటు అంటూ కన్నీరు పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: