ఈ రోజుల్లో సినిమా అనగానే ఎంత ప్రచారం చేస్తే అంతగా జనాల్లోకి వెళ్తుంది. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ జనాలు ఫాలో అయ్యే ట్రెండ్ దాదాపుగా ఇదే అని చెప్పవచ్చు. అందుకే దర్శక నిర్మాతలు కూడా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాహుబలి సినిమా తర్వాత ఇది మరింతగా ఎక్కువైంది అనే చెప్పవచ్చు. సినిమా మొదలైనప్పటి నుంచి విడుదల అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నారు. ఎంతగా జనాల్లోకి తీసుకువెళ్తే అంత హిట్ అని భావిస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు భీష్మ సినిమాకు ఈ ప్రచారమే బాగా కలిసి వచ్చింది అంటున్నారు జనాలు. టీజర్, ట్రైలర్, సాంగ్స్, హీరో హీరోయిన్ చేసిన ప్రచారం, సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవ్వకపోవడం ఇలాంటివి అన్నీ కూడా సినిమా కు బాగా ప్లస్ అయ్యాయి అనే చెప్పవచ్చు. టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత మంచి సినిమా రాకపోవడం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. హీరోయిన్ చేసిన ప్రచారం కూడా సినిమాకు బాగా హైలెట్ అయింది. హీరో నితిన్ తో కలిసి ఎక్కువ ప్రచారం చేసింది. 

 

ఇంటర్వ్యుల లో కూడా బాగా చలాకీగా కనపడింది. నితిన్ తో స్నేహం విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇవన్నీ భీష్మను హిట్ ట్రాక్ లోకి ఎక్కించాయి. అలాగే నితిన్ పెళ్లి అంశం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమా ప్రచారంలో పెళ్లిని ఎక్కువ గా హైలెట్ చేసారు. ఇక సినిమా కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని ప్రస్తావించడం, నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవన్ అభిమానులు కూడా ఎక్కువగానే చూస్తున్నారు. ఇవన్ని సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: