మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలుగా వచ్చారు.  పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లు హీరోలుగా వచ్చి మంచి పొజీషన్లోకి వెళ్లారు.  ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరున్ తేజ్, చిరు మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ లు హీరోలు గా పరిచయం అయ్యారు.  ఈ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  అయితే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం పులివాసు దర్శకుడిగా రిజ్వాన్ నిర్మిస్తున్న సూపర్ మచ్చి సినిమా రూపొందుతుంది.

 

ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ను చిరంజీవి పరిశీలించారట. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.  చిరంజీవి పూర్తి కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు మొదలైందట. అయితే స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా పట్టు కనిపించకపోవడంతో, ఆయన పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దింపినట్టుగా సమాచారం.  గతంలో వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుడున్న సాయిధరమ్ తేజ్ కి మంచి సలహాలు సూచనలు ఇవ్వడం.. కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు చెప్పడంతో ఈ కుర్రహీరో వరుసగా రెండు హిట్స్ కొట్టాడు.

 

అయితే తన అల్లుడు కళ్యాన్ దేవ్ మూవీ మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో  డైలాగ్స్ పై కూడా దృష్టి పెట్టమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సూచనలు.. సలహాలు ఇస్తూ వెళుతున్నారట.  అంతే కాదు ఖర్చు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అంటున్నారట. సినిమా పూర్తయిన తరువాత దీనిని దిల్ రాజు చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి వున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: