ఛలో సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించింది హీరో నాగశౌర్య మాత్రమే కాదు.. ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల కూడా. ఈ సినిమాతో నిర్మాతగా కూడా నాగశౌర్య మంచి లాభాలు పొందాడు. రష్మిక మందన కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత నాగశౌర్య దర్శకుడు వెంకీ కుడుములపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విమర్శలకు వెంకీ కుడుముల భీష్మ హిట్ తో గట్టి సమాధానమే చెప్పినట్టైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

 

ఛలో సినిమాకు సగం కథలో మార్పు చేసింది తానేనని నాగశౌర్య అంటున్నాడు. వెంకీ మొదట తీసుకొచ్చిన కథ అంతగా లేదని చాలా మార్పులు చేసి సినిమా ఇంత హిట్ కావడంలో తన పాత్ర ఉందని అన్నాడు. కానీ వెంకీ కుడుముల సినిమా తనవల్లే హిట్ అయిందని అనటం తగదని కూడా విమర్శించాడు. తన తల్లి వెంకీకి కారు గిఫ్ట్ గా ఇచ్చినా వెంకీ తీసుకోలేదంటూ వెంకీని విమర్శించాడు. అయితే.. వెంకీ మాత్రం తనకు తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తిపై కామెంట్ చేయనన్నాడు. కానీ ఇప్పుడు భీష్మ హిట్ తో నాగశౌర్యకు వెంకీ కుడుముల సమాధానం చెప్పినట్టైంది. కథ, కథనం, టేకింగ్, మేకింగ్, కామెడీ లో ఎక్కడా తడబడకుండా వెంకీ కుడుముల చూపిన దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడమే ఇందుకు ఉదాహరణ.

 

 

ఛలో విషయంలో నాగశౌర్యవెంకీ కుడుముల మధ్య జరిగిందేంటో తెలియదు కానీ మనస్పర్ధలు మాత్రం వచ్చేశాయి. మొత్తానికి వెంకీ కుడుముల భీష్మ హిట్ చేసుకుని టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించినట్టే. ఇక టాలీవుడ్ హీరోలు వెంకీ కథలు, మేకింగ్ పై నమ్మకంతో అవకాశాలు ఇవ్వడమే తరువాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: