ఈ మద్య నార్త్ వైపు బీజేపీ నేతలు కొంత మంది హద్దులు దాటి మాటలు తూలుతున్నారు.  తమ ఇష్టం వచ్చి పదజాలంతో కొంత మంద నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో కంట్రవర్సీ అవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి.  తాజాగా బీజేపీ నేత మహిళల గురించి మరోసారి కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు.  నెలసరి సమయంలో భర్తలకు వంట చేసే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా పుడతారంటూ స్వామి కృష్ణస్వరూప్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారితీశాయి.

 

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఓ మహిళకు బీజేపీ అధికార ప్రతినిధి ఇచ్చిన రిప్లై ఇప్పుడు మరింత ఫైర్ అవుతున్నారు.  అయితే ఆ బీజేపీ నేతలకు ప్రముఖ బాలీవుడ్ నటి  స్వరభాస్కర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. దాంతో వీరిద్దరి మద్ద రచ్చ మరింత ఎక్కువ అయ్యింది.  వివరాల్లోకి వెళితే.. స్వామీజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ  ఓ మహిళ కుక్కల ఫోటో ఒకటి షేర్ చేసుకున్నారు. ఇదిగో ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు ఆడకుక్కలు అయ్యారు. వాళ్లు చేసిన పాపమల్లా ఏమంటే... గత జన్మలో నెలసరిలో ఉండగా తమ భర్తలకు వంటచేయడమే అని ఆమె పేర్కొన్నారు. దానికి కౌంటర్ గా బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ స్పందిస్తూ.. మరి ఈ రెండింటిలో మీరు ఎవరు అని ప్రశ్నిందింది.  

 

దాంతో చిర్రెత్తుకొచ్చిన నటి స్వరభాస్కర్  బీజేపీ జాతీయ ప్రతినిధి ఓ బహిరంగ వేదికపై మహిళలను దూషిస్తున్నారు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం అగర్వాల్ జీ.. మీ తల్లిదండ్రులు మీకు దేవుడి పేరు పెట్టారు. కనీసం ఆ పేరుకైనా విలువ ఇవ్వండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మరి వీరి మద్య జరుగుతున్న మాటల యుద్దం ఎంత వరకు వెళ్తుంది.. రాజకీయంగా ఎన్ని వైరాలు సృష్టిస్తుంది అన్న విషయం ముందు ముందు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: