నితిన్ రష్మిక మందన్న ల కలయికలో తెరకెక్కిన తాజా సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పిడివి ప్రసాద్ సమర్పణలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఛలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వం వహించగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ కు శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. హీరో నితిన్ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, అలానే హీరోయిన్ రష్మిక అందంతో పాటు కమెడియన్ వెన్నెల కిశోర్ కామెడీ సీన్స్ వంటివి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్తున్నారు. 

 

సినిమాలో రెండు ట్విస్టులు ఉన్నాయని, అలానే మధ్యలో వచ్చే యాక్షన్, ఫైట్స్ కూడా ఎంతో బాగున్నాయని, ఇక సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో కామెడీ పంచ్ డైలాగ్స్ వింటుంటే ఎక్కువగా మనకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుర్తుకు వస్తారని, ఆ విధంగా దర్శకుడు వెంకీ అందరినీ ఆకట్టుకునేలా డైలాగ్స్ రాసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఎక్కడ అయితే సినిమా కొంత స్లో అవుతుందో, సరిగ్గా అటువంటి చోట్ల వెంటనే ఆకట్టుకునే ఎంటెర్టైనింగ్ సీన్స్ ని జోడించడం అంత సులువైన విషయం కాదని, ఆ విధంగా సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేసేలా దర్శకుడు పడిన శ్రమకు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. 

 

ఇక వెన్నెల కిషోర్ కు ఈ సినిమా తరువాత మరింత గొప్ప పేరు రావడం ఖాయం అని అంటున్నారు. సినిమాలో మూడు సాంగ్స్ బాగున్నాయని, ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఖుషి స్టైల్ రొమాంటిక్ సీన్ సినిమాలో ఎంతో హైలైట్ అని, ఈ విధంగా దర్శకుడిగా ద్వితీయ విఘ్నాన్ని దాటేసిన వెంకీ, రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: