యువ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పిడివి ప్రసాద్ నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఇక శివ రాత్రి పర్వదినం కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. తొలిసినిమా ఛలో తో మంచి హిట్ అందుకున్న వెంకీ, ఈ సినిమాతో కూడా దానిని కొనసాగించి కెరీర్ పరంగా ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడని అంటున్నారు ఆడియన్స్. 

 

ఆర్గానిక్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో మంచి ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, రష్మిక లతో పాటు కమెడియన్ వెన్నెల కిశోర్ పండించిన హాస్యం ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. వెన్నెల కిషోర్ ట్రాక్ మనల్ని మరోసారి కడుపుబ్బా నవ్విస్తుంది. సంపత్ రాజ్, నరేష్, బ్రహ్మాజీల బెస్ట్ పెర్ఫార్మన్స్ తో వీరి ట్రాక్స్ కూడా సూపర్బ్ గా పేలాయి. మెయిన్ గా ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు భీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. నెగటివ్ షేడ్స్ లో జిష్హు షేన్ గుప్తా మరోసారి మెప్పించాడు. 

 

అలాగే సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కీలక పాత్రలో అందరినీ మెప్పించాడు. ఇక మధ్యలో వచ్చే సాంగ్స్ కొంత రెఫ్రెషింగ్ గా ఉంటాయని, అయితే అక్కడక్కడా కొంత ల్యాగింగ్ గా అనిపించినప్పటికీ ఓవరాల్ గా దర్శకుడు వెంకీ కుడుములు సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని అంటున్నారు. ఇక కామెడీ ఈ సినిమాలో పెద్ద ప్లస్ అని, అలానే ఎప్పటినుండో సరైన హిట్ లేక కెరీర్ పరంగా సతమతం అవుతున్న నితిన్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: