వరసగా మూడు డిజాస్టర్ల తరువాత
మాస్ రాజా రవితేజ ఇటీవల డిస్కోరాజాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గత సినిమాలకు తీసిపోకుండా డిజాస్టర్ టాక్ తో
డిస్కోరాజా భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈచిత్రం తరువాత
రవితేజ ప్రస్తుతం యంగ్
డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో
క్రాక్ లో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కొన్ని నెలల నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది.
ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు
క్రాక్ టీజర్ విడుదలకానుంది.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో
సముద్రఖని ,వరలక్ష్మి
శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బలుపు తరువాత
శృతి హాసన్ ,
రవితేజ కలిసి నటిచడం ఇది రెండో సారి.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. మే 8న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ
క్రాక్ తోనైనా హిట్ కొట్టి రవితేజ
సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
కాగా రవితేజ-గోపిచంద్ కాంబోలో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను యావరేజ్ అనిపించుకోగా బలుపు సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమా తరువాత
రవితేజ ,రైడ్ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఏప్రిల్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. హవీష్ కోనేరు నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్
బ్యూటీ కియరా అద్వానీ
హీరోయిన్ గా నటించనుందని టాక్. రమేష్ వర్మ-రవితేజ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వీర పరాజయం పాలైయింది.